అభ్యర్థుల గెలుపు కొరకు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేపట్టిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసా నాయుడు
శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామo లో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి ) ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు,ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారి గెలుపు కొరకు గ్రామo లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేయజేస్తూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని గెలిపించాలని,ఎంపీ గా అంబికా లక్ష్మి నారాయణ గారిని గెలిపించాలని,మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.
ఈ సందర్బంగా అలం నరసానాయుడు గారు* మాట్లాడుతూ రైతులు సాగు నీరు కొరకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు అని, జలయజ్ఞం పేరుతో రైతులను దారుణంగా వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది అని మండిపడ్డారు. ఈ వైసీపీ నాయకులకు రైతుల యోగక్షేమలు పట్టవని కేవలం తన స్వార్థ రాజకీయాలు, కుట్ర పూరిత రాజీకీయాలు కోసం పరితపిస్తూ రైతులను బలిపశువులను చేస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడచుసిన అవినీతి, అక్రమాలు, బెదిరింపులతో ప్రజలు విసిగిపోయినారు,జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించి తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది అని, ప్రజలకు స్వేచ్ఛ జీవుతాన్ని ఇస్తుంది అని ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోని, ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని సైకో ముఖ్యమంత్రి చేతిల్లో నుంచి విముక్తి కల్పిద్దాం అని అన్నారు.
ఈ సందర్భంగా 6 భవిష్యత్తు గ్యారంటి పథకాల గురించి ప్రజలకు ఆలం నరసానాయుడు వివరించారు.ఈ కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Apr 29 2024, 06:38